జెండా వందనం చేసే మంత్రులు వీరే! | Finalized The List Of AP Ministers Who Hoisting The Flag On August 15 | Sakshi
Sakshi News home page

జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

Aug 13 2019 6:31 PM | Updated on Aug 13 2019 6:41 PM

Finalized The List Of AP Ministers Who Hoisting The Flag On August 15 - Sakshi

సాక్షి, అమరావతి : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జిల్లాలలో జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారైంది. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరులో హోం మంత్రి సుచరిత, కర్నూల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి జెండా వందనం సమర్పించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement