ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల | MLC Elections: Robbery At Balanagar Resident After They Gone To Casting Vote | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటేసి వచ్చేసరికి ఇల్లు గుల్ల

Mar 16 2021 2:56 PM | Updated on Mar 16 2021 3:01 PM

MLC Elections: Robbery At Balanagar Resident After They Gone To Casting Vote - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాలానగర్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇల్లుగుల్ల చేసిన ఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ. వాహిదుద్దీన్‌ వివరాల ప్రకారం.. బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని పద్మానగర్‌ ఫేజ్‌ –1 లో ముక్కు పద్మ దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 11న బీరువాలో 5.5. తులాల బంగారు ఆభరణాలు దాచి పెట్టారు.  అయితే.. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి వచ్చి బీరువా తెరచి చూడగా అందులో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement