బిగ్బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ. బిగ్బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్తో హౌస్లో అలరించింది. ఈ షో ద్వారా టాలీవుడ్లో మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉంటోంది.
తాజాగా బిగ్బాస్ అశ్విని శ్రీ కన్నీటి పర్యంతమైంది. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిన విషాద వార్తను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ ఫుల్ ఎమోషనలైంది. సోనుకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లే చనిపోయాడని అశ్విని శ్రీ తెలిపింది.
అశ్విని శ్రీ తన ఇన్స్టాలో రాస్తూ..'నేను నా సోను బాయ్ని కోల్పోయా.. ఈ బాధ భరించరానిది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నా అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.


