భారత్ ఆహ్వానానికి ఒబామా అంగీకారం | Narendra Modi invites Barack Obama to be Chief Guest at next Republic Day | Sakshi
Sakshi News home page

భారత్ ఆహ్వానానికి ఒబామా అంగీకారం

Nov 21 2014 9:44 PM | Updated on Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా(ఫైల్) - Sakshi

నరేంద్ర మోదీ, బరాక్ ఒబామా(ఫైల్)

భారత్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు.

న్యూఢిల్లీ: భారత్ ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. వచ్చే ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా హాజరుకానున్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఒబామాను ఆహ్వానించారు. ఇందుకు ఒబామా అంగీకరించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు.

ఒబామాను త గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినట్టు అంతకుముందు నరేంద్ర మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రధాని హోదాలో అమెరికా పర్యటించిన మోదీ... ఒబామాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో వైట్ హౌస్ లో విందుకు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement