కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు? | Cancellation of registration of KK lands | Sakshi
Sakshi News home page

కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు?

Jun 14 2017 6:48 AM | Updated on Mar 28 2018 11:26 AM

కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు? - Sakshi

కేకే భూముల రిజిస్ట్రేషన్‌ రద్దు?

ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ణయించింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ణయించింది. 22ఏ కింద డిక్లేర్‌ చేసిన భూముల్లో 36 ఎకరాలను గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ నుంచి కేకే కుటుంబీకులు కొన్నట్లు స్పష్టం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిన రెవెన్యూ యంత్రాంగం.. రిజిస్ట్రేషన్‌ రద్దు అంశాన్ని కూడా పొందుపరిచింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దీనిపై తదుపరి అడుగు వేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement