టైమ్స్‌ స్క్వేర్‌ భవనం ఐదో అంతస్తులో మంటలు


ముంబై: ముంబైలోని తూర్పు అంధేరి పట్టణంలో టైమ్స్‌ స్క్వేర్‌ భవనం ఐదవ అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని కాసేపటికి మంటలను అదుపులోకి తెచ్చారు.



ఈ భవనంలో చాలావరకూ కార్పొరేట్‌, ఐటీ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ  ఘటనలో అదృష్టవశాత్తూ భవనంలో ఉన్న వారు ఎవరికీ గాయాలు కాలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top