10 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు: గంగ్వార్ | CCI sells bales of cotton on october 10th | Sakshi
Sakshi News home page

10 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు: గంగ్వార్

Oct 2 2015 7:59 PM | Updated on Oct 1 2018 2:09 PM

ఈ నెల 10వ తేదీ నుండి సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు

హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీ  నుండి  సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్  వెల్లడించారు.  రైతుల సాయంతోనే  దళారి వ్యవస్థను  అడ్డుకోగలమని ఆయన అన్నారు.  పత్తి అమ్మిన వారం లోపే రైతు ఖాతాలో డబ్బులు పడేలా అధికారులను సూచించారు.

అమీర్పేట సెస్ ఆడిటోరియంలో శుక్రవారం  జరిగిన పత్తి రైతుల సదస్సుకు కేంద్ర జౌళి శాక మంత్రి సంతోష్ గంగ్వార్, దత్తాత్రేయలు హాజరయ్యారు.  మద్దతు ధర ఇంకా తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేయటంతో...  మద్దతు ధరపై మరోసారి ప్రధానితో కలిసి చర్చిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement