
పాదయాత్రకు వెళుతున్న శ్రీవెంకటేశ్వర భక్త బృందం
పటాన్చెరు నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తబృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లింది. తొలుత ఈ బృందం సభ్యులు పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు.
పటాన్చెరు టౌన్: పటాన్చెరు నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తబృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లింది. తొలుత ఈ బృందం సభ్యులు పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. వీరికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సపాన్దేవ్ పూలమాలలు వేసి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తబృందం నిర్వాహకులు సీసాల రాజు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా తాము తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం 13వసారి పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు.