తిరుమలకు పాదయాత్ర | tirumala by walk | Sakshi
Sakshi News home page

తిరుమలకు పాదయాత్ర

Aug 7 2016 5:50 PM | Updated on Sep 4 2017 8:17 AM

పాదయాత్రకు వెళుతున్న శ్రీవెంకటేశ్వర భక్త బృందం

పాదయాత్రకు వెళుతున్న శ్రీవెంకటేశ్వర భక్త బృందం

పటాన్‌చెరు నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తబృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లింది. తొలుత ఈ బృందం సభ్యులు పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు.

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు నుంచి  శ్రీ వెంకటేశ్వర భక్తబృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లింది. తొలుత ఈ బృందం సభ్యులు పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. వీరికి ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ సపాన్‌దేవ్‌ పూలమాలలు వేసి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  భక్తబృందం నిర్వాహకులు సీసాల రాజు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా తాము తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం 13వసారి పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement