పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు  | Srinubabu receives Champions of Change award | Sakshi
Sakshi News home page

పల్సస్‌ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు 

Dec 27 2018 2:03 AM | Updated on Dec 27 2018 2:03 AM

Srinubabu receives Champions of Change award - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్‌ సీఈఓ, ఎండీ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు దక్కింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును అందుకున్నారు. పల్సస్‌ సంస్థ... ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా  హెల్త్‌ కేర్‌ రంగానికి సంబంధించి ఓపెన్‌ యాక్సెస్‌ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది. విదేశాలతో పాటు హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, విశాఖపట్నం ప్రాంతాల్లో సంస్థకు కార్యాలయాలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement