రాయలసీమలోని తిరుపతి పట్టణాన్ని తెలంగాణలో కలపాలని కోరితే సీమాంధ్ర నేతలు అంగీకరిస్తారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలోని తిరుపతి పట్టణాన్ని తెలంగాణలో కలపాలని కోరితే సీమాంధ్ర నేతలు అంగీకరిస్తారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో కలపాలని ప్రతిపాదించడం అసంబద్ధమైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీరాముడు లేని తెలంగాణను తాము ఊహించుకోలేమన్నారు.
యూటీ అంటే అంతర్యుద్ధమే: నిరంజన్
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదనను నగరంలో నివసించే ప్రజలెవరూ ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం ప్రతినిధి జి.నిరంజన్ చెప్పారు. కేంద్రం ఈ విషయంపై ముందుకు వెళితే అంతుర్యుద్ధం తప్పదన్నారు.