సీమాంధ్రుల కుట్రను రాష్ర్టపతికి నివేదిస్తాం: హరీష్ | Harish Rao takes on Seemandhra leaders | Sakshi
Sakshi News home page

సీమాంధ్రుల కుట్రను రాష్ర్టపతికి నివేదిస్తాం: హరీష్

Dec 21 2013 3:09 AM | Updated on Sep 2 2017 1:48 AM

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి రాత పూర్వకంగా నివేదిస్తామని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు వెల్లడించారు.

జహీరాబాద్,న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి రాత పూర్వకంగా నివేదిస్తామని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం రాత్రి మెదక్ జిల్లా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలమంతా శనివారం రాష్ట్రపతిని కలిసి సీమాంధ్ర నేతల వ్యవహార శైలిని వివరిస్తామని తెలిపారు. స్పీకర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ తెలంగాణ విషయమై చర్చ ప్రారంభించలేద ని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అఖరి బంతి మిగిలే ఉందని సీఎం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప విభజనను ఏ మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ముఖ్యమంత్రితో కుమ్కక్కయ్యారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement