కార్యాలయ ఫైల్స్ ఇ– ఆఫీస్ ద్వారా జరగాలి
కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా అన్ని వ్యవసాయ కార్యాలయాల్లో ఫైల్స్ అన్ని ఇక మీదట ఇ– ఆఫీస్ ద్వారా జరగాలని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ సూచించారు. కడప కలెక్టరేట్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై ఏ ౖఫైలెనా సరే ఇ– ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. ఎవరూ మ్యాన్యువల్ పద్ధతిలో చేయకూడదని సూచించారు. దీనిపై ప్రతి రెండు రోజులకొక సారి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జేడీఏ కార్యాలయ ఏడీ మాధవి, జేడీఏ కార్యాలయ ఏఓ గోవర్థన్, సిబ్బంది పాల్గొన్నారు.


