ఈ సైకిల్ యాత్రకు మరింత హంగులు అద్దడానికి కొంతమంది విద్యార్థులను రంగంలోకి దించారు. బాబు గారు, ఆయన మంత్రులు హ్యాపీగా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఎంజాయ్ చేస్తే.. విద్యార్థులకు మాత్రం తొక్కే కొద్దీ అలసట వచ్చే సాధారణ పెడల్ సైకిళ్లు ఇచ్చారు. నోవాటెల్ హోటల్ రాగానే బాబు గారి షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అంతే, అధికారులు తక్షణమే విద్యార్థుల నుంచి సైకిళ్లను లాగేసుకుని.. ‘మీ పనైపోయింది, ఇక ఇంటికిపోండి’ అంటూ మండుటెండలో రోడ్డు మీద వదిలేశారు. వేడి తాపానికి ఆ పిల్లలు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.


