59వ వార్డు నెహ్రూ నగర్, 91వ వార్డులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు జహీర్ అహ్మద్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
దక్షిణలో..
నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ జంక్షన్తో పాటు జగదాంబ జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద, అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద, టౌన్కొత్తరోడ్డు, జ్ఞానాపురం కాన్వెంట్ జంక్షన్లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేస్తూ నిరసన చేపట్టారు.


