హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 734 వద్ద.. శ్రీదుర్గా మహేశ్వరి ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలు ఆర్పడంలో నిమగ్నమైంది.
ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. తొలుత డ్రైవర్ క్యాబిన్లో మంటలు వచ్చాయి. దీంతో.. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోని 18 మంది ప్రయాణికులను కిందికి దించేశారు. తరువాత మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది.
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
కేపీహెచ్బీ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా, మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద బస్సులో చెలరేగిన మంటలు
పాలకొల్లు వెళ్లాల్సిన (NL02B9955) గా గుర్తింపు
అప్రమత్తమై ప్రయాణికులను దింపేసిన సిబ్బంది
ఘటనా… pic.twitter.com/MZq4P0YoZy— Telugu Scribe (@TeluguScribe) April 17, 2026


