వసతుల లేమితో సర్కారు స్కూళ్లు శిథిలావస్థలో భవనాలు.. టాయిలెట్స్ అస్తవ్యస్తం బెంచీలు కొరత.. జాడలేని యూనిఫామ్స్ ఈనెల 15నుంచి విద్యా సంవత్సరం ఆరంభం
‘ఇది వీర్నపల్లి మండలం భావుసింగ్నాయక్ తండాలోని ప్రభుత్వ బడి. ఇటీవల కురిసిన జల్లులకు పాఠశాల ప్రాంగణం వర్షం నీటితో ఇలా నిండింది. వానాకాలం ఆరంభమైతే పిల్లలు మోకాల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే’.
జిల్లాలో..
అంబేడ్కర్నగర్ జెడ్పీ స్కూల్ ఆవరణలో విరిగిన చెట్టు
‘చెట్ల కింద చదువులు సాగిస్తున్న ఈ విద్యార్థుల ఫొటో ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపడినట్లే. జిల్లా కేంద్రంలోని గీతానగర్ ప్రాథమిక పాఠశాలలోనిది. ఇందులో గత విద్యా సంవత్సరం 108 మంది విద్యార్థులు చదివారు. 1 నుంచి 5వ తరగతి వరకు రెండే గదులు ఉండడంతో సరిపోక ఇలా చెట్ల కింద చదువులు సాగించారు’.
ప్రైమరీ స్కూళ్లు 333
యూపీఎస్ 39
హైస్కూల్స్ 111
విద్యార్థులు 31,426


