● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్
కోనరావుపేట(వేములవాడ): ధాన్యం సేకరణ, లోడింగ్తోపాటు రైస్మిల్లుల వద్ద అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. మండలంలోని కొలనూర్, మర్తనపేట, నాగారం, ధర్మారం, కనగర్తి, నిజామాబాద్, వెంకట్రావుపేటల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కనగర్తిలోని కనకదుర్గ, మారుతి రైస్మిల్లులు, కొలనూర్లోని సరస్వతి, వినాయక రైస్మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యానికి సంబంధించి ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలో జాప్యం చేయొద్దన్నారు. తహసీల్దార్ వరలక్ష్మి, సర్పంచ్ జలగం అరవింద్రావు తదితరులు ఉన్నారు.


