సాక్షి, హైదరాబాద్: భారతదేశ రాజకీయ చరిత్రలోనే పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమేనని.. అందులో భారత రాష్ట్ర సమితి ఒకటని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జెండా ఎగరేసిన ఆయన.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్. గత రెండున్నరేళ్లుగా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు పోరాడతాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పునరంకితం అవుతుంది. కేసీఆర్ సైనికులుగా బలగంగ కలిసికట్టుగా కదం తొక్కుతాం.
‘‘మరికాసేపట్లో తెలంగాణ భవన్కు కేసీఆర్ రానున్నారు. నేతలకు దిశ నిర్దేశం చేస్తారు’’ అని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన విముఖత ప్రదర్శించారు.
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎస్ రాజకీయ… pic.twitter.com/1vrQbOtCqL— KTR (@KTRBRS) April 27, 2026


