గుమ్మలక్ష్మీపురం: మండల కేంద్రంలో ఆర్టిసీ బస్సుకు, అందు లోని ప్రయానికులకు ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వచ్చిన ఆర్టీసీ బస్సు యూనియన్ బ్యాంకు దగ్గరికి చేరుకోగా ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి ముందరి టైరు దిగిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ ఒరిగిన బస్సును నిలుపుదల చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.


