ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Jun 8 2026 9:59 AM | Updated on Jun 8 2026 9:59 AM

రుద్రూర్‌: పోతంగల్‌, కోటగిరి, రుద్రూర్‌ మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలుల కారణంగా పోతంగల్‌ మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన గొంటి సాయిలు ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. అలాగే ఓ ఇంటిపై చెట్టు పడటంతో వెంటనే స్థానికులు స్పందించి తొలగించారు. రుద్రూర్‌ మండలం లింగంపల్లి శివారులో విద్యుత్‌ స్తంభం, పోతంగల్‌ రహదారిపై చెట్టు నేలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సిరికొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విరిగిపోయి విద్యుత్‌ తీగలపై పడడంతో స్తంభాలు ధ్వంసం అయ్యాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయి రోడ్లపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement