కొత్త ఐపీఎస్‌లకు పోస్టింగ్‌ | Centre Allots New IPS Officers To Telugu States | Sakshi
Sakshi News home page

తెలంగాణ‌కు న‌లుగురు, ఆంధ్ర‌కు ముగ్గురు 

Jan 20 2021 6:59 PM | Updated on Jan 20 2021 7:15 PM

Centre Allots New IPS Officers To Telugu States - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాల‌కు 7గురు అధికారుల‌ను కేటాయించింది. తెలంగాణకు న‌లుగురు, ఆంధ్ర‌కు ముగ్గురు చొప్పున కేటాయించింది. 

తెలంగాణకు కేటాయించిన అధికారులు

ప‌రితోష్ పంక‌జ్‌(142 ర్యాంకు, బీహార్‌) 
సిరిశెట్టి సంకీత్‌(330 ర్యాంకు, తెలంగాణ‌) 
పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(418 ర్యాంకు, మ‌హారాష్ర్ట‌) 
అంకిత్ కుమార్ శంక్వార్‌(563 ర్యాంకు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేటాయించిన ఐపీఎస్‌లు 

అడ‌హ‌ల్లి(440 ర్యాంకు, క‌ర్ణాట‌క‌)
పంక‌జ్ కుమార్ మీనా(666 ర్యాంకు, రాజ‌స్థాన్‌) 
ధీర‌జ్ కునుబిల్లి(320 ర్యాంకు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన ఎంవీ స‌త్య‌సాయి కార్తీక్‌(103 ర్యాంకు)ను మ‌హారాష్ర్ట‌కు, షీత‌ల్ కుమార్‌(417 ర్యాంకు)ను అసోంకు, రాజ‌నాల స్మృతిక్‌(466 ర్యాంకు)ను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు కేటాయించింది.

Advertisement
 
Advertisement
Advertisement