టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతర వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక బాబీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవితో జతకట్టారు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. బాబీతో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించనున్న చిత్రం వచ్చే నెలలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ కాకాజీ అని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫ్యామిలీతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బాబీ pic.twitter.com/aXxXVBlxUM
— Telugu360 (@Telugu360) April 24, 2026


