నేత్రాలు దానం | - | Sakshi
Sakshi News home page

నేత్రాలు దానం

Jun 15 2026 4:10 AM | Updated on Jun 15 2026 4:10 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌/కాసిపేట:మంచిర్యాల,కు మురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల క విత సోమవారం పర్యటించనున్నారు. ఆసిఫా బాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ కుమురం భీం జిల్లా అధ్యక్షుడు కిర్మి ల్ల వినోద్‌ మాట్లాడారు. మందమర్రి ఏరియా కాసిపేట గని వద్ద గేట్‌ మీటింగ్‌, మంచిర్యాలలో మీడియా సమావేశం, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, లక్సెట్టిపేటలో జెండా పండుగలు, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు తర్వాత కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. పార్టీ జిల్లా పరిశీలకుడు జనార్దన్‌, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే బాబురావ్‌ హాజరవుతారని తెలిపారు.

బెల్లంపల్లి: గుండెపోటుతో వ్యక్తి మృతిచెందగా, కు టుంబ సభ్యులు ఆయన నేత్రాలు దానం చేశారు. మున్సిపాలిటీ షంషీర్‌నగర్‌ బస్తీకి చెందిన జడల రమేశ్‌ ఆదివారం గుండెపోటుతో అకాల మృతిచెందాడు. అతని కళ్లు దానం చేసి అంధులకు కంటి చూపు ప్రసాదించవచ్చని జనహిత సేవా సమితి నిర్వాహకులు బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించగా వారు ముందుకొచ్చారు. వాసన్‌ ఐ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందు వచ్చి రమేశ్‌ నేత్రాలను సేకరించాడు. పుట్టెడు దు:ఖంలో కూడా నేత్రదానం చేసేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులకు జనహిత సేవాసమితి అధ్యక్షుడు ఆడేపు మహేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సర్టిఫికేట్‌ అందజేశారు. కార్యక్రమంలో జనహిత సేవా సమితి నిర్వాహకులు ఇప్ప రవి, కె.గిరిప్రసాద్‌, గురుస్వామి, సుకుమార్‌, కనకయ్యతోపాటు దేవసాని వెంకన్న పాల్గొన్నారు.

నేడు టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత పర్యటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement