గాలివీస్తే విద్యుత్‌ కట్‌కట | - | Sakshi
Sakshi News home page

గాలివీస్తే విద్యుత్‌ కట్‌కట

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్‌ కోతలు ● ఉక్కపోతకు తోడు..కరెంట్‌ కోతలతో జనం విలవిల ● ఓవర్‌ లోడ్‌తోనూ తప్పని తిప్పలు ● విద్యుత్‌ శాఖలో నిర్వహణ లోపం ● పెనమలూరు నియోజకవర్గంలోని పెనమ లూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో రాత్రిళ్లు విద్యుత్‌ సాంకేతిక పరమైన సమస్యలతో విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తున్నారు. దీంతో ప్రజలు ఉక్కపోతకు విలవిల్లాడుతున్నారు. ● గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో యథేచ్ఛగా అనధికారిక విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రధానంగా గన్నవరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్‌లోడ్‌ కారణంగానే సరఫరా నిలుపుదల అవుతోందని ఆ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజు బాక్సులు తరచూ కాలిపోవటం వల్ల సమస్య జటిలం అవుతోంది. ● పామర్రు నియోజకవర్గంలో రూరల్‌ పరిధిలోని గ్రామాల్లో రాత్రిళ్లు రెండు గంటలకు ఒకసారి పావుగంట పాటు కోత విధిస్తున్నారు. చిన్న పాటి గాలులకు సైతం విద్యుత్‌ సరఫరా విధిస్తున్నారు. ● పెడన నియోజకవర్గం పరిధిలో పెడన పట్టణంలో 2, 3, 14 వార్డుల్లో విద్యుత్‌ కోతలు అధికంగా ఉన్నాయి. కోతలు లేవంటూనే అధికారులు అనధికారికంగా కోతలు విధిస్తూ ఉండటంతో ప్రజలు ఉక్కపోతకు విలవిలాడుతున్నారు. కృత్తివెన్నులో లో ఓల్టేజీ సమస్య కారణంగా విద్యుత్‌ సజావుగా సరఫరాకాక ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోఓల్టేజీతో చేపల చెరువుల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని వాటి నిర్వాహకులు వాపోతున్నారు. ●అవనిగడ్డ నియోజకవర్గం వ్యాప్తంగా ట్రిప్‌ అవుతుందన్న పేరుతో అనధికారికంగా నియోజకవర్గం వ్యాప్తంగా అవనిగడ్డ, ఘంటసాల, కోడూరు, నాగాయలంక ఇతర గ్రామాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రెండు, మూడు గంటలకు పైగా కోతలు విధిస్తుండటం వల్ల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు తాగునీటి సరఫరా సజావుగా సాగటం లేదు.

మచిలీపట్నంలో..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్‌ కోతలు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: అనధికార విద్యుత్‌ కోతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపాటి గాలులు వీస్తే చాలు ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు అనధికార విద్యుత్‌ కోతలు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 220 కేవీ / 132 కేవీ ఈహెచ్‌టీ (ఎక్స్‌ట్రా హై టెన్షన్‌) లైన్లు, వాటి కింద ఉన్న ఫీడర్లలో ఓవర్‌లోడ్‌ పడితే ఆ ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తున్నారని సమాచారం. ఓవర్‌ లోడ్‌ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగా కొత్త లైన్లు వేయకపోవడం, ఉన్న లైన్లను అప్‌గ్రేడ్‌ చేయకపోవడం, ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్‌ నిర్మాణాలు చేపట్టనందు వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుణదల నుంచి ఆటోనగర్‌, గుణదల నుంచి గంగూరు, తాడికొండ నుంచి తాడేపల్లి 132 కేవీ లైన్ల పరిధిలో ఓవర్‌ లోడ్‌ కారణంగా వాటి పరిధిలోని ఫీడర్లలో అనధికారికంగా విద్యుత్‌ కోత విధిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. జనవరిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గరిష్ట వినియోగం రోజుకు 18 మిలియన్‌ యూనిట్లు. మంగళవారం విద్యుత్‌ వినియోగం 27.54 మిలియన్‌ యూనిట్లకు పెరి గింది. ఈ పెరుగుదలను ముందుగా అంచనా వేసి, దానికి అనుణంగా చర్యలు తీసుకోవడంలో విద్యుత్‌ శాఖ యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో అనధికార కోతలు తప్పడం లేదు.

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవ ర్గంలో మచిలీపట్నం రూరల్‌ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రతి రోజూ పగలూ రాత్రి అన్న తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. మచిలీపట్నం పట్టణ పరిధిలో చిన్నపాటి గాలులు వీచినా విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తున్నారు. అసలే మండే ఎండలకు విద్యుత్‌ కోతలు తోడవ్వటంతో ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement