రాయచూరు రూరల్: విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గంగా పరమేశ్వరి కాలనీలో అభిజ్ఞాన అంగ్ల గ్ల భాషా పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. నేడు విద్యకున్న ప్రాధాన్యత ఏ రంగానికీ లేదన్నారు. ప్రయత్న వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రమేష్, సాహితీవేత్త ఈరణ్ణ బెంగాలి, రవి, చంద్ర గిరీష్లున్నారు.


