చినుకు కోసం చూపులు! | - | Sakshi
Sakshi News home page

చినుకు కోసం చూపులు!

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

చినుకు కోసం చూపులు!

ప్రధాన జలాశయాలు, చెరువులు, బోర్ల కింద ఆయకట్టు (ఎకరాల్లో..)

జిల్లాలో వానాకాలం పంటల సాగు అంచనా (ఎకరాల్లో..)

పదిరోజులాయే వానల్లేవు

ముందస్తు వర్షాలు కురిసి

మళ్లీ కనిపించని వైనం

నారుమడులు సిద్ధం చేసిన రైతుల్లో అయోమయం

నిజాంసాగర్‌(జుక్కల్‌): జిల్లాలోని పలు ప్రాంతాల రైతులను మృగశిర కార్తె వర్షం మురిపించింది. ముందస్తు వర్షాలతో రైతులు సాగు పనులకు సన్నద్ధమయ్యారు. చాలాచోట్ల నారుమడులను సిద్ధం చేసి విత్తనాలు అలికారు. అయితే వారం, పది రోజులుగా మళ్లీ వర్షం కురవకపోవడంతో నారుమడులు ఎండుతున్నాయి. చెరువులు, కుంటలు, వర్షంపై ఆధారపడి పంట సాగు చేసే రైతులు నారుమడులను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. జూన్‌, జూలై నెలల్లో వర్షాలు కురిసినా.. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయిలో వర్షాలు ప్రారంభమైన తరువాతే సాగు పనులు ప్రారంభించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు అలికిన చోట్ల వర్షం లేక మొలకలు రావడం లేదు. మొలకలు వచ్చిన చోట్ల ఎండిపోయే పరిస్థితి ఉంది. మరోనాలుగైదు రోజుల్లో వర్షాలు కురకపోవతే నారుమడులు ఎండిపోయే ప్రమాదం ఉంది.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు 31,927

పోచారం 10,500

కౌలాస్‌ నాలా 9,000

జిల్లాలో చెరువులు ఆయకట్టు

2069 97,123

బోరుబావులు ఆయకట్టు

1,09,717 1,45,122

వరి 3.20 లక్షలు

మొక్కజొన్న 54,500 వేలు

పత్తి 45,500

సోయా 90,684

మినుము 2,858

పెసర 3,382

కంది 41,500

చెరుకు 588

ఇతర పంటలు 278

రోహిణి, మిర్గం రోజుల్లో వానపడటంతో నారు మడి వేసుకున్నా. వారం రోజుల సంది వర్షాలు లేవు. కుంటలో నుంచి నీటిని తెచ్చి నారుమడిని తడుపుతున్నా. వర్షాలు పడతాయని నమ్మకంతో సాగుకు సిద్ధమైన.

– దనుల ఎల్లయ్య, రైతు, వెల్లుట్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement