దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్‌ ఆచార్య ఆర్‌ శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య జి సింహాచలం మంగళవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఏ సోషియాలజీ, సోషల్‌ వర్క్‌, ఎకనామిక్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సైకాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్‌న్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్‌న్స్‌ మొదటి, రెండవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వైబ్సెట్‌ నుండి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌, పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్‌ జైనలుద్దీన్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు కోదండపాణి, వై వెంకటప్పారెడ్డి, సూపరింటెండెంట్‌ జవ్వాజి శ్రీనివాస్‌, ఉద్యోగులు, వలి, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement