ప్రస్తుతం రాష్ట్రంలో అన్నదాత సంతోషంగా లేడు. మనకు మూడు పూట్ల తిండిపెట్టే అన్నదాత బాధపడుతుంటే అది రాష్ట్రానికే అరిష్టం. అన్నదాతలను అన్నివిధాల అదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఎరువులు, పురుగుమందుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణ లేదు. గతేడాది ఖరీఫ్ సీజన్లో సకాలంలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. రైతులను ఇబ్బందులకు గురిచేయటం సరికాదు.
– ఎన్. సిద్ధయ్య,
రిటైర్ట్ తహసీల్దార్, బాపట్ల తాలుకా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు


