రాజకీయాల్లో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించాలనే ధోరణిలో పనిచేసే ఏ ప్రభుత్వాలు నిలబడవు. క్షేత్రస్థాయిలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న రైతుభరోసాకేంద్రం (ఆర్బీకే) ద్వారా అందించిన అన్నిరకాల సేవలు యథావిధిగా కొనసాగిస్తే బాగుంటుంది. రైతులు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. రైతులను ఇబ్బందులకు గురిచేయటం సరికాదు. ముఖ్యంగా రాజకీయాల్లో మన ప్రాంతంపై అవగాహన, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులనే ఎంపికచేసుకోవాలి.
– పి.వి.కృష్ణయ్య, రిటైర్డ్ అసోసియేట్ డీన్, బాపట్ల వ్యవసాయ కళాశాల


