సాక్షి,విజయవాడ : ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్వయంగా తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లి, ఆయన తండ్రి చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.


