సాక్షి,అమరావతి: ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి కూటమి ప్రభుత్వం మరింత ఆజ్యం పోసింది. నాలుగు రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్ను సరఫరా చేయాలని నిర్ణయించింది.
దీంతో కూటమి సర్కార్ చర్యలతో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది.


