కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు స్వాగతం పలుకుతున్న విశాఖపట్నం కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
మహారాణిపేట: సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై శుక్ర, శనివారాల్లో నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్న జాతీయ వర్క్షాప్లో పాల్గొనేందుకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్) గురువారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా నోవాటెల్ హోటల్ వద్ద కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయస్వాగతం పలికారు.


