ఏపీఏఐఎంఎస్‌ ద్వారా ఎరువుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఏపీఏఐఎంఎస్‌ ద్వారా ఎరువుల పంపిణీ

Jun 15 2026 12:05 AM | Updated on Jun 15 2026 12:05 AM

చింతపల్లి: చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోని రైతులకు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నట్టు వ్యవవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తిరుమలరావు తెలిపారు. గత ఏడాది రైతులు నమోదు చేసుకున్న ఈ–క్రాప్‌లో ఎటువంటి తప్పొప్పులు ఉన్నా, వాటిని ఈ ఏడాది ఈ యాప్‌ ద్వారా సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో నమోదైన పంటల్లో మార్పులు చేసుకున్నా, ఆధార్‌ అనుసంధానం కాకపోయినా, రైతు మొత్తం విస్తీర్ణం నమోదు కాకపోయినా ఈ యాప్‌ ద్వారా రైతు సేవా కేంద్రంలో సరిచేసుకోవచ్చున్నారు. ఈ సంవత్సరం మీ పంటకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరవులను మూడుసార్లు 20 రోజుల వ్యవధిలో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.వ్యవసాయ భూమి, కౌలు రైతులకు మాత్రమే అందజేస్తామన్నారు. రైతులు విదిగా ఏపీఏఐఎంఎస్‌ యాప్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement