పోలీసులు స్వాధీనం చేసుకున్న
పొక్లెయిన్, ట్రాక్టర్లు
మాకవరపాలెం: మట్టిని అక్రమంగా తవ్వుతున్న పొక్లెయిన్, తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని వజ్రగడ సమీపంలో నిత్యం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి సిబ్బందితో దాడి చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. ఈ దాడిలో ఒక పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించామన్నారు. గంగవరం, రామన్నపాలెం, పైడిపాల తదితర ప్రాంతంలోనూ చెరువులు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో రాత్రి వేళల్లో మట్టి తరలింపు జరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


