విశాఖ విద్య: నీట్ పరీక్ష రద్దు వ్యవహారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసింది. నెలలు, సంవత్సరాల తరబడి ప్రత్యేక శిక్షణలతో పరీక్ష రాస్తే.. లీకేజీ భూతం విద్యార్థుల భవిష్యత్తు ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నేపథ్యంలో జూన్ 21న మళ్లీ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న వేళ.. విద్యార్థులను ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు వెంటాడుతున్నాయి. ఆ భయాలను పటాపంచలు చేస్తూ, మనోధైర్యంతో ముందుకు సాగేందుకు మానసిక నిపుణులు, లైఫ్ కోచ్లు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పరీక్షను ఎలా ఎదుర్కోవాలో ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు వారి మాటల్లోనే..


