breaking news
Amanjot Kaur
-
Women's World Cup: అమన్ కన్నీటి గాథ
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ఎట్టకేలకు మన అమ్మాయిల సొంతమైంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తొలిసారి వరల్డ్కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.2005, 2017లో ఫైనల్స్లో ఓటమిని చవిచూసిన టీమిండియా.. మూడో ప్రయత్నంతో విశ్వవిజేతగా నిలిచింది. కాగా హర్మన్ సారథ్యంలోని భారత జట్టు తొలి వరల్డ్కప్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ది కీలక పాత్ర. ఫైనల్లో అమన్జోత్ అద్బుతమైన క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పింది. సెంచరీతో కదం తొక్కి భారత బౌలర్లకు కొరకరాని కోయ్యిగా మారిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ను సంచలన క్యాచ్తో ఆమె పెవిలియన్కు పంపింది. ఈ ఒక్క క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే తన క్యాచ్తో భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన అమన్జోత్ కౌర్ వెనక ఆమె కుటుంబం చేసిన త్యాగం కూడా ఉంది. ప్రపంచకప్ వంటి వేదికలో తన బిడ్డ సత్తాచాటాలని ఆమె కుటుంబం ఎంతో బాధను దిగమింగారు.ఏమి జరిగిందంటే?ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత అమన్జోత్ కౌర్ వాళ్ల నానమ్మ భగవంతి(75) గుండెపోటుకు గురయ్యారు. అయితే అమన్జోత్ తన ఆటపై ఏకాగ్రత కోల్పోకూడదని ఆమె తండ్రి భూపిందర్ సింగ్తో సహా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచారు. ఈ విషయాన్ని తాజాగా భూపిందర్ సింగ్ వెల్లడించారు. భారత్ విజయం సాధించిన వెంటనే అమన్జోత్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుటుంబంతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.అమన్జోత్ ఈ స్దాయికి చేరుకుకోవడంలో మా అమ్మ భగవంతిది కీలక పాత్ర. అమన్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజు నుంచి మా అమ్మ ఆమెకు ఎంతో సపోర్ట్గా ఉండేది. అమన్ చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి ఎక్కడికి వెళ్లినా మా అమ్మ తన వెనుక వెళ్లేది. అయితే గత నెలలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని మేము అమన్జోత్కు తెలియజేయలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇటువంటి కఠిన సమయంలో ప్రపంచ కప్ విజయం మాకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ విజయం గురుంచి మా అమ్మకు తెలియజేశాము. ఆమె వెంటనే కళ్లు తెరిచి చూసింది అని అని భూపిందర్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.ప్రస్తుతం అమన్ వాళ్ల నానమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కాగా ఈ టోర్నమెంట్లో 7 మ్యాచ్లు ఆడిన అమన్జోత్.. 146 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టింది. ఫైనల్లో లారా వోల్వార్ట్ క్యాచ్తో అద్బుతమైన రనౌట్తో కూడా అమన్ మెరిసింది.చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయంAfter India’s World Cup triumph, cricketer Amanjot Kaur’s father grew emotional, expressing immense pride and joy over his daughter’s remarkable achievement.#WomensWorldCup2025 #WomenInBlue pic.twitter.com/Q1azAudoIj— Karan Verma (@Mekaranverma) November 2, 2025 -
విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ
2025, నవంబర్ 2. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన రోజు. ఈ రోజు భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2025 ఎడిషన్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపుతో యావత్ భారతావణి ఉప్పొంగి పోయింది. భారత ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లు కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసిన టీమిండియా ప్లేయర్ల వెనుక ఎన్నో త్యాగాలు, పోరాటాలు, కన్నీరు, కలలు దాగి ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.హర్మన్ప్రీత్ కౌర్.. దూషించిన నోళ్లతోనే జేజేలు కొట్టించుకుందిపంజాబ్లోని మోగాలో జన్మించిన హర్మన్ప్రీత్, తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టింది. 1983లో కపిల్ దేవ్ భారత జట్టుకు తొలి ప్రపంచకప్ అందించి, పురుషుల క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికితే.. హర్మన్ 2025 ప్రపంచకప్ విక్టరీతో మహిళల క్రికెట్లో కొత్త శకాన్ని ప్రారంభించింది.హర్మన్ క్రీడల్లో అడుపెట్టాలనుకున్న అందరు అమ్మాయిల్లాగే చిన్నతనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె భారత జట్టు కెప్టెన్గా ఎదిగి భారతీయుల ప్రపంచకప్ కలను సాకారం చేసింది. చిన్నతనంలో హర్మన్ అబ్బాయిలతో క్రికెట్ ఆడుతూ మెళకువల నేర్చుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి రావడంతో అబ్బాయిలతో క్రికెట్ ఏంటని బంధులందరూ ఆమెను దూషించారు. అయినా పట్టువదలని హర్మన్ అనుకున్నది సాధించి దూషించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకుంది.Worked as a carpenter. Got taunted by many when young daughter started playing cricket with boys in the neighborhood. But he stood by her. Made her first bat with his own hands. Got her enrolled in an academy. Travelled far everyday to take her to training and decided to pick and https://t.co/fgmIiEAFtl— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025అమన్జోత్ కౌర్.. కార్పెంటర్ తండ్రి కలను నెరవేర్చిన కూతురుక్రికెటర్గా అమన్జోత్ ప్రయాణం తండ్రి చెక్కిన బ్యాట్తో మొదలైంది. ఆమె తండ్రి ఓ కార్పెంటర్. బాల్యంలో అమన్జోత్ బాలురతో క్రికెట్ ఆడటాన్ని చూసి ఊరంతా విమర్శించేవారు. అయినా తండ్రి ఆమెను వెనకేసుకొచ్చేవాడు. రోజూ 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అమన్జోత్ను అకాడమీకి తీసుకెళ్లెవాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత అమన్జోత్ తండ్రి ఆనంధానికి అవథుల్లేవు. “నా కూతురు గెలిచింది” అంటూ విజయ గర్వంతో ఊగిపోయాడు.Renuka's father passed away before she turned 3. He was such a cricket tragic that he named his son Vinod after Kambli. Renuka's mother encouraged her to take up the game despite being from a village in HP. Renuka showed her CWG Bronze to all the girls in her village. She will https://t.co/TBUEnQssJb— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025రేణుకా సింగ్.. తల్లి త్యాగాన్ని, అన్న నమ్మకాన్ని నిలబెట్టిందిహిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా జిల్లాలో జన్మించిన రేణుకా సింగ్కు మూడేళ్ల వయసుండగానే తండ్రి చనిపోయాడు. తల్లి సునీతా సింగే రేణుకా బాగోగులు చూసింది. రేణుకను క్రికెట్ అకాడమీకి పంపేందుకు సునీత ఎన్నో కష్టాలు పడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రేణుక కోసం తల్లి సునీత ఎన్నో త్యాగాలు చేసింది. రేణుక కోసం ఆమె అన్న వినోద్ కూడా క్రికెట్ను వదిలేశాడు. ఆర్దిక కష్టాలు ఉండటంతో ఇంట్లో ఒక్కరికే ఆకాడమీలో చేరే అవకాశం ఉండేది. రేణుక క్రికెట్లో రాణిస్తుండటంతో వినోద్ తన కలను చంపుకున్నాడు. చివరికి రేణుక ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచి తల్లి, అన్నల త్యాగాలకు న్యాయం చేసింది.Comes from Bundelkhand, backwaters of Indian cricket. Played tennis ball cricket with boys in the neighborhood. Toiled hard in domestic cricket for years. Became a net bowler in 2024 for MI before UP Warriorz picked her in the auctions. Soon made her India debut, took a 6 wicket https://t.co/NO7T8nd9L1— TheRandomCricketPhotosGuy (@RandomCricketP1) November 2, 2025క్రాంతి గౌడ్.. పోలీస్ కానిస్టేబుల్ కూతురుమధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని ఘువారా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాంతి గౌడ్ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది. క్రాంతి తండ్రి ఓ రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ, క్రాంతికి క్రికెట్పై ఉన్న ఆసక్తిని చూసి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. తండ్రి తన పెన్షన్తో ఆమెకు క్రికెట్ కిట్ కొనిపెట్టాడు. తల్లి రోజూ ప్రాక్టీస్కు తీసుకెళ్లేది.క్రాంతి చిన్నతనంలో అబ్బాయిలతో గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగింది. క్రాంతి క్రికెటర్ అవుతానంటే ఊరిలోని వారంతా నవ్వేవారు. ఇవాళ ఆమె ప్రపంచకప్లో భారత పేస్ బౌలింగ్ సెస్సేషన్గా నిలిచింది. టీమిండియా వరల్డ్కప్ గెలిచాక క్రాంతి సొంత ఊరిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. #WATCH | Rohtak, Haryana | Cricketer Shafali Sharma's father says, "... It is all by the grace of god. We are thankful to the almighty... The whole nation was praying for our victory... By the grace of god, she has become the player of the match... The whole team worked hard to… https://t.co/uV2mBjIT6V pic.twitter.com/65nBhFfITq— ANI (@ANI) November 2, 2025షఫాలీ వర్మ.. బాలుడి వేషధారణలో..!షఫాలీ వర్మ హర్యానా రాష్ట్రంలోని రూథక్లో జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు క్రికెట్పై ఆసక్తి పెరిగింది. కానీ స్థానిక అకాడమీలో అమ్మాయిలకు ప్రవేశం లేదు. దీంతో ఆమె బాలుడి వేషధారణలో, అన్న కోసం తయారు చేసిన జెర్సీ వేసుకుని ప్రాక్టీస్కి వెళ్లేది. షఫాలీ ఆర్థికంగా వెనుకపడిన కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి సంజయ్ వర్మ ఎంతో కష్టపడి ఆమెను అకాడమీలో చేర్పించాడు. ఓ సమయంలో అతని దగ్గర షఫాలీకి కిట్ కొనిచ్చే స్తోమత కూడా లేకుండింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న షఫాలీ ఫైనల్లో 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసి, భారత్ను విశ్వ విజేతగా నిలపడంలో ప్రధానపాత్ర పోషించింది.#WATCH | Agra, UP | Celebrations erupt at cricketer Dipti Sharma's residence as India win the ICC Women's World Cup by defeating South Africa by 52 runs. pic.twitter.com/zTbGBH82gK— ANI (@ANI) November 2, 2025దీప్తి శర్మ.. రైల్వే ఉద్యోగి తండ్రి కలను నిజం చేసిన బౌలింగ్ సంచలనంఉత్తరప్రదేశ్లోని సాగర్జీ నగర్కు చెందిన దీప్తి, తన అన్నతో కలిసి క్రికెట్ ఆడుతూ పెరిగింది. తండ్రి రైల్వే ఉద్యోగి. అందరిలాగే అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుండటంతో దీప్తి కూడా విమర్శలు ఎదుర్కొంది. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందడుగు వేసి, టీమిండియా ప్రపంచకప్ కలను సాకారం చేసింది. ఫైనల్లో దీప్తి అర్ద సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శనను నమోదు చేసింది.జెమిమా రోడ్రిగ్స్.. మల్టీ టాలెంటెడ్ స్టార్సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాది భారత్ను ఫైనల్కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్.. ముంబైలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. జెమిమా తండ్రి స్వయంగా కోచ్గా మారి ఆమెను ప్రాక్టీస్కు తీసుకెళ్లెవాడు. జెమిమాకు క్రికెట్తో పాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమె గిటార్ అద్భుతంగా వాయిస్తుంది. చదవండి: CWC25 Team India Prize Money: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
ఏడ్చేసిన హర్మన్ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో
ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్.. అమన్జోత్ కౌర్ (Amanjot Kaur) ఫోర్ బాది భారత్ విజయాన్ని ఖరారు చేయగానే సంబరాలు అంబరాన్నంటాయి.. పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ వన్డే వరల్డ్కప్-2025 (WC 2025) ఫైనల్కు చేరగానే.. నవీ ముంబై జయహో భారత్ నినాదాలతో హోరెత్తిపోయింది.. జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంఅమన్జోత్ సంతోషంలో మునిగిపోతే.. సెంచరీ హీరో జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగంతో నేలతల్లిని ముద్దాడింది.. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది.. భారత ప్లేయర్లంతా మైదానంలోకి దూసుకువచ్చి జెమీమాతో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.చిన్నపిల్లలా ఏడుస్తూఇక కీలక మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన హర్మన్ప్రీత్ కౌర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డగౌట్లో కోచ్లు, ఆటగాళ్లను హత్తుకుంటూ హర్మన్ కన్నీటి పర్యంతమైంది.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ సొంతగడ్డపై సాధించిన చారిత్రాత్మక విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దృశ్యాలు చూసిన యావత్ భారతావని ఉద్వేగానికి లోనవుతూనే జయజయధ్వానాలు చేస్తోంది.. ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా చాంపియన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళా జట్టును అభినందనలతో ముంచెత్తుతోంది.📽️ Raw reactions after an ecstatic win 🥹The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1— BCCI Women (@BCCIWomen) October 31, 2025ఆసీస్ను ఓడించిఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్లో భారత్ మూడోసారి ఫైనల్కు చేరింది. నవీ ముంబై వేదికగా తాజా ఎడిషన్ రెండో సెమీ ఫైనల్లో ఆసీస్ను ఓడించి ఈ ఘనత సాధించింది. డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో కెప్టెన్, డేంజరస్ ఓపెనర్ అలీసా హేలీ (5)ను క్రాంతి గౌడ్ శుభారంభం అందించినా.. ఫోబీ లిచ్ఫీల్డ్, ఎలిస్ పెర్రీ భారత శిబిరానికి ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు మిగల్చలేదు. లిచ్ఫీల్డ్ శతక్కొట్టగా (119), పెర్రీ 77 పరుగులతో రాణించింది.ఆరో నంబర్ బ్యాటర్ ఆష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 63) కూడా అర్ధ శతకంతో రాణించింది. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో ఆసీస్ 338 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లు షఫాలీ వర్మ (10), స్మృతి మంధాన (24) నిరాశపరిచారు.ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన జెమీమా అజేయ శతకం (127)తో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడుగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (89) దంచికొట్టగా.. దీప్తి శర్మ (17 బంతుల్లో 24), రిచా ఘోష్ (16 బంతుల్లో 26) వేగంగా ఆడి విజయ సమీకరణాన్ని సులువు చేశారు.ఆఖర్లో అమన్జోత్ (8 బంతుల్లో 15) కూడా మెరుపులు మెరిపించింది. ఫలితంగా 48.3 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 341 పరుగులు చేసిన భారత్.. ఆసీస్పై ఐదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో ఫైనల్కు దూసుకువెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం నాటి ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇందుకు నవీ ముంబై వేదిక.చదవండి: Jemimah Rodrigues Emotional Video: రోజూ ఏడుస్తూనే ఉన్నా.. నా సెంచరీకి ప్రాధాన్యం లేదుTHIS IS WHAT IT MEANS! 💙🥹👉 3rd CWC final for India👉 Highest-ever run chase in WODIs👉 Ended Australia's 15-match winning streak in CWC#CWC25 Final 👉 #INDvSA | SUN, 2nd Nov, 2 PM! pic.twitter.com/8laT3Mq25P— Star Sports (@StarSportsIndia) October 30, 2025 -
IND W Vs AUS W: రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత్ (చిత్రాలు)
-
మహిళల వన్డే ప్రపంచకప్ : శ్రీలంకపై భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
దీప్తి ఆల్రౌండ్ షో
గువాహటి: సొంతగడ్డపై అట్టహాసంగా ఆరంభమైన వన్డే ప్రపంచకప్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. బ్యాటింగ్లో అర్ధసెంచరీ సాధించిన దీప్తి శర్మ బౌలింగ్లో కీలక వికెట్లతో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచింది. దీంతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్... వర్షం వల్ల కుదించిన 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (53 బంతుల్లో 53; 3 ఫోర్లు), అమన్జోత్ కౌర్ (56 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రాణించారు. లంక బౌలర్లలో ఇనొక రణవీర 4 వికెట్లు, ప్రబోధని 2 వికెట్లు తీశారు. అనంతరం దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ చమరి ఆటపట్టు (47 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుగ్గా ఆడింది. దీప్తి (3/54) సహా భారత బౌలర్లు స్నేహ్ రాణా (2/32), ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి (2/37), క్రాంతి (1/41), అమన్జోత్ (1/37), ప్రతిక (1/6) సమష్టిగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు. అమన్జోత్తో నడిపించి... బౌలింగ్తో గెలిపించి... భారత వెటరన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఆల్రౌండ్ షోకు శ్రీలంక కుదేలైంది. ప్రతీక (37; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్లీన్ డియోల్ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ మరోవైపు కీలక స్టార్లు స్మృతి మంధాన (8), హర్మన్ప్రీత్ (21), జెమీమా (0), రిచా ఘోష్ (2) విఫలమవడంతో 124/6 స్కోరు వద్ద భారత్ పనైపోయిందనిపించింది. ఈ దశలో దీప్తి, అమన్జోత్తో కలిసి భారత్ను నడిపించింది. లంక అమ్మాయిల చెత్త ఫీల్డింగ్తో అమన్జోత్ మూడుసార్లు 18, 37, 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. ఇద్దరు అర్ధసెంచరీ పూర్తి చేసుకొని జట్టును ఒడ్డుకు చేర్చారు. ఏడో వికెట్కు 99 బంతుల్లో 103 పరుగులు జోడించాక ముందుగా అమన్జోత్, అనంతరం దీప్తి అవుటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించింది. తర్వాత కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ఓపెనర్, కెపె్టన్ చమరి ఆటపట్టు, వన్డౌన్ బ్యాటర్ హర్షిత (29; 3 ఫోర్లు), మిడిలార్డర్లో నీలాక్షిక సిల్వా (29 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్) మెరుగ్గా ఆడారంతే! మిగతా బ్యాటర్లను భారత బౌలింగ్ దళం క్రీజులో నిలువనీయలేదు.స్కోరు వివరాలుభారత మహిళల ఇన్నింగ్స్: ప్రతిక రావల్ (సి) విష్మి (బి) ఇనొక 37; స్మృతి మంధాన (సి) విష్మి (బి) ప్రబోధని 8; హర్లీన్ డియోల్ (సి) దిల్హారి (బి) ఇనొక 48; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ఇనొక 21; జెమీమా రోడ్రిగ్స్ (బి) ఇనొక 0; దీప్తి శర్మ (సి) సుగంధిక (బి) అచిని 53; రిచా ఘోష్ (సి) ప్రబోధని (బి) చమరి 2; అమన్జోత్ (సి) విష్మి (బి) ప్రబోధని 57; స్నేహ్ రాణా (నాటౌట్) 28; ఎక్స్ట్రాలు 15; మొత్తం (47 ఓవర్లలో 8 వికెట్లకు) 269. వికెట్ల పతనం: 1–14, 2–81, 3–120, 4–120, 5–121, 6–124, 7–227, 8–269. బౌలింగ్: అచిని కులసూర్య 8–0–42–1, ఉదేíÙక ప్రబోధని 10–1–55–2, సుగంధిక 9–0–46–0, కవిశా దిల్హారి 8–0–51–0, ఇనొక రణవీర 9–0–46–4, చమరి 3–0–24–1. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) క్రాంతి గౌడ్ 14; చమరి (బి) దీప్తి శర్మ 43; హర్షిత (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 29; విష్మి గుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) అమన్జోత్ 11; కవిశా (సి) రిచా ఘోష్ (బి) దీప్తి 15; నీలాక్షిక (బి) స్నేహ్ రాణా 35; అనుష్క (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తి 6; సుగంధిక (బి) స్నేహ్ రాణా 10; అచిని (సి) స్మృతి (బి) శ్రీచరణి 17; ప్రబోధని (నాటౌట్) 14; ఇనొక రణవీర (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రతిక రావల్ 3; ఎక్స్ట్రాలు 14; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1–30, 2–82, 3–103, 4–105, 5–130, 6–140, 7–173, 8–184, 9–199, 10–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–41–1, అమన్జోత్ 6–0–37–1, స్నేహ్ రాణా 10–0–32–2, దీప్తి శర్మ 10–1–54–3, శ్రీచరణి 8–0–37–2, ప్రతిక 2.4–0–6–1. -
చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. ప్రపంచ రికార్డు
భారత క్రికెటర్ రిచా ఘోష్ (Richa Ghosh) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక స్ట్రైక్రేటుతో వెయ్యి పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి ప్లేయర్గా నిలిచింది. ఇంగ్లండ్తో రెండో టీ20 (England Women vs India Women) సందర్భంగా రిచా ఘోష్ ఈ ఘనత సాధించింది.కాగా భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటింగ్హామ్లో ఆతిథ్య జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. తాజాగా రెండో టీ20లోనూ అదరగొట్టింది.బ్రిస్టల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో నాట్ సీవర్-బ్రంట్ బృందాన్ని ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యం సంపాదించింది.దంచికొట్టిన అమన్జోత్, రిచాఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (13), షెఫాలీ వర్మ (3) నిరాశపరిచినా.. వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ శతకం (41 బంతుల్లో 63)తో మెరిసింది.ఇక రెండో టీ20తో తిరిగి వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1) తీవ్రంగా నిరాశపరచగా.. ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’ అమన్జోత్ కౌర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ దంచికొట్టారు. అమన్జోత్ 40 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. మరోవైపు.. రిచా ఘోష్ 20 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో నాటౌట్గా ఉంది.తొలి మహిళా క్రికెటర్గా ప్రపంచ రికార్డుఈ క్రమంలోనే రిచా అరుదైన రికార్డులు తన సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 140కి పైగా స్ట్రైక్రేటుతో ఈ ఘనత సాధించింది. తద్వారా మహిళల అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో (T20 Format) ఈ ఫీట్ నమోదు చేసిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించింది.ఫాస్టెస్ట్ 1000.. రెండో ప్లేయర్గాఅదే విధంగా.. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో బంతుల పరం (702)గా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో మహిళా క్రికెటర్గానూ రిచా ఘోష్ నిలిచింది. అంతకుముందు ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన లూసీ బార్నెట్ 700 బంతుల్లో ఈ ఘనత సాధించింది.కాగా పదహారేళ్ల వయసులో 2020లో రిచా టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేసింది. ఇప్పటికి 64 మ్యాచ్లలో కలిపి 1029 పరుగులు సాధించింది. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాదు.. 21 ఏళ్ల రిచా 37 వన్డేల్లో 800, రెండు టెస్టు మ్యాచ్లలో కలిపి 151 పరుగులు సాధించింది.ఇంగ్లండ్ను మరోసారి ఓడించిన భారత్ఇక ఇంగ్లండ్తో రెండో టీ20 విషయానికొస్తే.. భారత్ విధించిన 182 లక్ష్యాన్ని ఛేదించడంలో ఆతిథ్య జట్టు విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన ఇంగ్లండ్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. టామీ బీమౌంట్ హాఫ్ సెంచరీ (54) చేయగా.. మిగతా వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. స్నేహ్ రాణా- రాధా యాదవ్, స్మృతి మంధాన- రిచా ఘోష్ జోడీలు రెండు రనౌట్లలో భాగమయ్యాయి.అత్యుత్తమ స్ట్రైక్రేటుతో మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు🏏రిచా ఘోష్ (ఇండియా)- 143.11 స్ట్రైక్రేటుతో 1029 రన్స్🏏లూసీ బార్నెట్ (ఐల్ ఆఫ్ మ్యాన్)- 139.69 స్ట్రైక్రేటుతో 1172 రన్స్🏏తాహిలా మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 132.94 స్ట్రైక్రేటుతో 132.94 రన్స్🏏క్లో టైరాన్ (సౌతాఫ్రికా)- 132.81 స్ట్రైక్రేటుతో 1283 రన్స్🏏అలీసా హేలీ (ఆస్ట్రేలియా)- 129.79 స్ట్రైక్రేటుతో 3208 రన్స్చదవండి: సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్లో టీమిండియా యువ సంచలనం ఆల్రౌండ్ షో -
ENG W Vs IND W : ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం
బ్రిస్టల్: బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్ (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, 1 సిక్స్), అమన్జ్యోత్ కౌర్ (40 బంతుల్లో 63 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఫలితంగా ఇంగ్లండ్తో రెండో టి20లో భారత మహిళల క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. కాగా ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా మంగళవారం రెండో మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. రిచా ఘోష్ (20 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడింది. గత మ్యాచ్లో సెంచరీతో విజృభించిన స్మృతి మంధాన (13; 2 ఫోర్లు), షఫాలీ వర్మ (3), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్బెల్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో టామీ బీమౌంట్ అర్ధ శతకం (54)తో రాణించగా.. మిగిలిన వారిలో ఎమీ జోన్స్ (32), సోఫీ ఎక్లిస్టోన్ (35) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు దక్కించుకోగా.. దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన అమన్జోత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


