రెండ్రోజుల ముందే పండుగ.. | Southwest Monsoon hits Kerala, North East | Sakshi
Sakshi News home page

రెండ్రోజుల ముందే పండుగ..

May 30 2017 11:11 AM | Updated on Sep 5 2017 12:22 PM

రెండ్రోజుల ముందే పండుగ..

రెండ్రోజుల ముందే పండుగ..

భారత వ్యవసాయరంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి.

- కేరళ, ఈశాన్య భారతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
- సాధారణం కంటే రెండు రోజుల ముందే రాక


న్యూఢిల్లీ:
భారత వ్యవసాయరంగానికి ప్రాణాధారమైన నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందే దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించాయి. అండమాన్‌ దీవుల మీదుగా ప్రయాణించిన రుతుపవనాలు మంగళవారం ఉదయం ఇటు దక్షిణ కేరళ, అటు ఈశాన్య భారతంలోకి ప్రవేశించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడి, వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా జూన్‌1న నైరుతి రుతుపవనాలు కేరళలను తాకుతాయి. అందుకు భిన్నంగా ఈ సారి రెండురోజుల ముందే ఆగమనం చేశాయి.

జూన్‌ మొదటివారంలో తెలంగాణ, ఏపీలకు
మంగళవారం భారత్‌లోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ జూన్‌ మొదటివారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను తాకనున్నాయి. దీంతో రైతులు వ్యవసాయపనులను వేగవంతం చేశారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement