'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు' | minister ktr speaks over siricilla textile park | Sakshi
Sakshi News home page

'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు'

Feb 25 2017 5:31 PM | Updated on Aug 30 2019 8:24 PM

'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు' - Sakshi

'టెక్స్‌టైల్‌ పార్కు అభివృద్ధికి నిధులు'

సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కేటీఆర్ చెప్పారు.

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చేనేత, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దక్షిణ భారత టెక్స్‌టైల్ మిల్లుల ప్రతినిధుల బృందం సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌ను శనివారం సందర్శించింది. ఆ ప్రతినిధుల బృందంతో మంత్రి భేటీయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త్రిపుర రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుని సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. త్వరలోనే త్రిపురలో స్టడీ టూర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో కోయంబత్తూరు, తిరుపూరు మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement