అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టుకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. శ
అస్సాంతో రంజీ మ్యాచ్
గువాహటి: అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర జట్టుకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. శనివారం తమ రెండో ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అయితే అస్సాం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి ఇంకా 59 పరుగులు వెనుకబడి ఉంది. ఆదివారం ఆటకు చివరి రోజు.
అంతకుముందు అస్సాం తమ తొలి ఇన్నిం గ్స్లో 145 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌట్ అ య్యింది. దీంతో జట్టుకు 175 పరుగుల ఆధిక్యం ల భించింది. పుర్కయస్థ (248 బంతుల్లో 108 నాటౌట్; 14 ఫోర్లు; 3 సిక్సర్లు) అజేయ శతకం సాధించాడు.