
న్యూఢిల్లీ : తెలుగు ఎంపీల నిరసనలతో లోక్సభ హోరెత్తిపోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీలు శుక్రవారం సభలో నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టుకొని స్పీకర్ వెల్లోకి చొచ్చుకెళ్లారు. అటు టీఆర్ఎస్ ఎంపీలు సైతం రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున నినాదాలు చేసి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత వారించినప్పటికీ ఎంపీలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభను సోమవారానికి వాయిదావేశారు.