'ప్రత్యూషను ఎల్లుండి మా ఎదుట ప్రవేశపెట్టండి' | high court judges to talk to Pratyusha on wednesday | Sakshi
Sakshi News home page

'ప్రత్యూషను ఎల్లుండి మా ఎదుట ప్రవేశపెట్టండి'

Jul 27 2015 11:18 AM | Updated on Aug 31 2018 8:24 PM

తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష కేసు విచారణ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

హైదరాబాద్ : తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష కేసు విచారణ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యూష ఆరోగ్యంపై న్యాయస్థానం ఆరా తీసింది. అయితే ఆమెకు మరో రెండు రోజులు చికిత్స అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నించారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యూషను తమ ఛాంబర్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు ...పోలీసులకు ఆదేశించింది. అలాగే ఇటువంటి కేసులు తమ దృష్టికి తీసుకు రావాలని పోలీసులకు సూచించింది. అనంతరం కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement