
తెలంగాణ ఎగ్జిబిషన్
అంశాలను మేళవించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు ఖైరతాబాద్లోని నాసర్ స్కూల్ వేదికైంది.
పంజగుట్ట: రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఎగ్జిబిషన్’ ఆకట్టుకుంటోంది. అన్ని అంశాలను మేళవించి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు ఖైరతాబాద్లోని నాసర్ స్కూల్ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ శుక్రవారం ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ప్రదర్శన రెండు రోజుల పాటు కొనసాగుతుందని ప్రిన్సిపాల్ మధుబాబాలా కపూర్, వైస్ ప్రిన్సిపాల్ శోభా జయశంకర్ తెలిపారు.