మంత్రి సునీత అధికార దుర్వినియోగం | kanganapally mpp by elections won by tdp | Sakshi
Sakshi News home page

మంత్రి సునీత అధికార దుర్వినియోగం

Dec 14 2016 1:18 PM | Updated on Aug 14 2018 2:50 PM

మంత్రి సునీత అధికార దుర్వినియోగం - Sakshi

మంత్రి సునీత అధికార దుర్వినియోగం

కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు పనిచేశాయి.

అనంతపురం: కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతల ప్రలోభాలు, బెదిరింపులు పనిచేశాయి. ఎంపీటీసీలను బెదిరించి, ప్రలోభపెట్టి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్‌ఆర్‌ సీపీకి మెజార్టీ స్థానాలున్నా మంత్రి పరిటాల సునీత ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

ఉప ఎన్నిక సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పాటు.. మామిళ్ల పల్లి దగ్గర ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. రాప్తాడులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement