సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం | BS6 Cars To Be Sold in India From April 2020: Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం

Oct 26 2018 12:33 AM | Updated on Oct 26 2018 12:33 AM

BS6 Cars To Be Sold in India From April 2020: Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: బీఎస్‌–6 ప్రమాణాల వాహనాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానం స్పష్టత నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి కేవలం బీఎస్‌–6 వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్‌ మాత్రమే జరిగేలా పూర్తి స్థాయి లో కృషి చేస్తామని వివరించింది. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బీఎస్‌–6యేతర వాహనాలను నిర్దిష్ట గడువు తర్వాత కూడా విక్రయించుకునేలా కొంత వ్యవధి ఇవ్వాలన్న వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement