సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన విషయంలో యూటర్న్ను తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన విషయంలో యూటర్న్ను తీసుకోవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. విభజనకు అంగీకరించిన నేతలు విధానాలను మార్చుకోవడం ఏమిటో ఇకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. సీమాంధ్ర టీడీపి, కాంగ్రెస్ నేతల వల్ల తెలుగు ప్రజల మధ్య ఉన్న సామరస్యత దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనకు నేతలు సహకరించకపోతే విపరీత పరిస్థితులు తలెత్తుతాయని పొంగులేటి హెచ్చరించారు.
కాంగ్రెస్, టిడిపి నేతలు రెండు ప్రాంతాలలో రెండు రకాలుగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.