ఇద్దరే పిల్లలున్నారంటూ ఎమ్మెల్యే వెంకటరమణ తప్పుడు అఫిడవిట్: భార్య ఫిర్యాదు | MLA's wife complaints against him in krishna district | Sakshi
Sakshi News home page

ఇద్దరే పిల్లలున్నారంటూ ఎమ్మెల్యే వెంకటరమణ తప్పుడు అఫిడవిట్: భార్య ఫిర్యాదు

Aug 26 2013 10:07 PM | Updated on Aug 14 2018 4:32 PM

కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై ఆయన భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. విడాకులివ్వాలంటూ తనను వేధిస్తున్నారని, వరకట్న వేధింపులకు కూడా గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. పైపెచ్చు, తమకు ముగ్గరు పిల్లలుంటే, ఇద్దరే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారని తెలిపారు.

వెంకటరమణ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తనపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె చెప్పారు. తక్షణమే ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సునీత పోలీసు స్టేషన్‌లో బైఠాయించారు. ఎమ్మెల్యే వ్యవహారంపై మండవల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి, వాస్తవాలు తెలిశాక ఎన్నికల కమిషన్‌కు , కలెక్టర్‌కు పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement