సీఎం చంద్రబాబు నాయుడు మాదిగల ద్రోహిగా మిగిలిపోయారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాదిగల ద్రోహిగా మిగిలిపోయారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తాను పెద్ద మాదిగనవుతానని మోసం చేశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని చంద్రబాబు ఢిల్లీ తీసుకు వెళ్లాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. జూలై 7న అమరావతిలో మాదిగల కురుక్షేత్రం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.