అన్యమత ప్రకటనలపై ప్రభుత్వం సీరియస్‌ | Sakshi
Sakshi News home page

అన్యమత ప్రకటనలపై ప్రభుత్వం సీరియస్‌

Published Sun, Aug 25 2019 10:06 PM

Andhra Pradesh Government Serious On Tirupati Ticket Issue - Sakshi

సాక్షి, తిరుమల: ఆర్టీసీ బస్‌ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు  ముద్రించడం పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను గత మార్చిలో ముద్రించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ఈ ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. కాగా,  ఈ ప్రకటనలను కొనసాగించిన అధికారుల పై ప్రభుత్వం వేటు వేసింది.  దీనికి సంబంధించి నెల్లూరు జోనల్‌ స్టోర్స్‌ కంట్రోలర్‌ జగదీష్‌బాబును సస్పెండ్‌ చేసింది.  

Advertisement
Advertisement