పోలీసు కస్టడీకి నేపాలీ గ్యాంగ్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసు కస్టడీకి నేపాలీ గ్యాంగ్‌

Jun 7 2026 9:12 AM | Updated on Jun 7 2026 9:12 AM

పోలీసు కస్టడీకి నేపాలీ గ్యాంగ్‌

బంజారాహిల్స్‌: గత నెల 8వ తేదీన ప్రశాసన్‌నగర్‌లోని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌ భార్య తనూజరంజన్‌ను దారుణంగా హత్య చేసి బంగారు నగలతో ఉడాయించిన నేపాలీ గ్యాంగ్‌లో ఒక నిందితుడిని, నగలు కొనుగోలు చేసిన రిసీవర్‌ను ఇటీవల జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్‌ ధర్మతో పాటు మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి నేపాల్‌లోకి అడుగుపెట్టారు. చోరీకి గురైన సొత్తులో కొంత మాత్రమే రికవరీ అయ్యింది. మిగతా సొమ్ముతో పాటు ప్రధాన సూత్రధారులైన నేపాలీ గ్యాంగ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్‌ సునీల్‌ పెరియార్‌తో పాటు రిసీవర్‌ దిలీప్‌లను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని మరింత లోతుగా విచారించనున్నారు. ఆ రోజు జరిగిన ఘటనతో పాటు హత్య చేసిన అనంతరం ఎక్కడెక్కడికి వెళ్లారు.. తదితర వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

సునీల్‌

దిలీప్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement