ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రషా తడాని తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది. ఈ మూవీని చందమామ కథలు బ్యానర్పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లుక్ చూస్తుంటే విలన్గా అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని తిరుపతి నేపథ్యంలో రూపొందించారు. టీజర్లో డైలాగ్స్, ఫైట్ సీన్స్ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో కథ ఉండనున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.
Srinu - Manga and their eternal love tale ❤️🔥#SrinivasaMangapuram Teaser out now 🔥
-- https://t.co/OvECTgsBpT
In cinemas this 2026 💥#JayaKrishnaGhattamaneni @themohanbabu #RashaThadani @DirAjayBhupathi @AshwiniDuttCh @gemini_kiran @gvprakash @CKPicturesoffl… pic.twitter.com/tLoPCLy7W8— Telugu Film Journalists Association (@FilmJournalists) April 15, 2026


